మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురానున్న అమెరికా సంస్థలు..!

-

కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కీలక మానవ పరీక్షలు తుది దశకు చేరిన క్రమంలో​ వ్యాక్సిన్‌ రాకపై స్పష్టత వస్తోంది. తమ వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతమైతే అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని అమెరికాకు చెందిన మోడెర్నా ఫైజర్‌ సంస్థ వెల్లడించింది.

ఈ ఏడాది నవంబర్‌ నాటికే తమ వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్‌ ప్రణాళికలు వేసుకుంటోంది. మొత్తం 30,000 మందిపై మానవ పరీక్షలను ఇప్పటికే ప్రారంభించాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఆ సంస్థకు అమెరికా ప్రభుత్వం రూ.7500 కోట్ల నిధులు సమకూర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news