ప్రధాని మోదీ: భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే నా కల…

-

ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధానిని కలిసి మోదీ.. భారత్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గతంలోనే నేను ఆస్ట్రేలియా వస్తానని మాటిచ్చానని సిడ్నీ లో జరిగిన సభలో మాట్లాడారు. ఇక్కడ సిడ్నీలో నివసించే భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ… భారత్ మరియు ఆస్ట్రేలియాను కలిపే బంధం యోగా అని ఈ సందర్భంగా అన్నారు. జీవనాన్ని వెతుక్కుంటూ వచ్చిన భారతీయులను ఆస్ట్రేలియా అక్కున చేర్చుకుందని హ్యాపీగా పంచుకున్నారు. మోదీ మాట్లాడుతూ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే నా కల అని పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రపంచంలో ఇంటర్ నెట్ ను ఎక్కువగా వాడే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉందని, ఇది కాకుండా పలు రంగాలలో భారత్ మొదటి స్థానంలో ఉండి ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా ఉందని సంతోషంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news