బ్రేకింగ్ : బండి సంజయ్ కు మోడీ ఫోన్..

-

తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసినట్టు సమాచారం. ఎన్నికల స్థితిగతుల గురించి ప్రధాని  వివరాలు అడిగి  తెలుసుకున్నట్టు చెబుతున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ,ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితుల పై ప్రధాని మోడీ మాట్లాడినట్టు చెబుతున్నారు. కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని మోడీ అభినందించినట్టు తెలంగాణా బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

నాయకులు, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం గురించి మోడీ వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడారని తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోడీ కొనియాడి నట్టు సమాచారం. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోడం మీద మూడే హర్షం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా జాతీయ స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Latest news