మోడీ నయా నియంతలా మారారు – రేవంత్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ నయా నియంతలా మారారని విమర్శించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ పై అనార్హత వేటుకు వ్యతిరేకంగా గాంధీ భవన్ లో నిర్వహించిన సత్యాగ్రహ నిరసన దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని.. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక బిజెపి సర్కార్ ఆయన పై కుట్ర చేసిందని ఆరోపించారు.

తన మిత్రుడైన అదానీ కోసం మొత్తం దేశాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. అదాని, ప్రధాని డబుల్ ఇంజన్ తరహాలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని ఏద్దెవా చేశారు. ఇక దీక్ష ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణ పై సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news