తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది – ప్రధాని మోడీ

-

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. హైదరాబాద్- సికింద్రాబాద్ 85 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ సబ్ అర్బన్ సర్వీసుల్ని ప్రారంభించిన ప్రధాని మోడీ… అనంతరం ప్రసంగించారు. ప్రియమయిన సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక న మస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడారు ప్రధాని మోడీ.

తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు.. వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించాం.. భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించామని వివరించారు. 11 వేల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ, జాతికి అంకితం చేశాం.. రైల్, రోడ్ కనెక్టివిటీ, హెల్త్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news