యువ హీరోలను అవమానించడంతో.. కన్నీరు పెట్టుకున్న బాలయ్య..!!

-

ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య బాబు నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో రెండవ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి తాజాగా యంగ్ హీరోలైన విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ అతిధులుగా హాజరయ్యారు. ఇక వీరిద్దరి రాకతో స్టేజ్ మొత్తం ప్రేక్షకుల కోలాహాలాలతో మారుమ్రోగిపోయింది. అంతేకాదు వీరిద్దరూ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి రోల్ మోడల్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి తమ దర్శకత్వంలో తామే సినిమాలు చేసి ఉన్నత స్థానానికి చేరుకున్నారు . అందుకే కొత్త వాళ్లకు ఈ యంగ్ హీరోలు రోల్ మోడల్ అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వక్ సేన్ అలాగే సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు తాము ఎదుర్కొన్న అవమానాలను బాలయ్య బాబుతో వివరించారు. ఇక ఆ కష్టాలను విని బాలయ్య కూడా కళ్ళు చమర్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా ఆ ప్రోమోలో ఈ హీరోలు ఇద్దరు అందరి చేత కంటతడి పెట్టిస్తున్నారు. ప్రోమోలో భాగంగా బిగ్ ఇన్సల్ట్ మీ లైఫ్ లో ఏమిటి? అని హీరో సిద్దుని బాలయ్య బాబు అడగగా.. మొహం మీద మచ్చలేసుకుని నువ్వు హీరో అవుతావా? అంటూ నవ్వారు అని చెప్పాడు . దాంతో బాలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. నువ్వు చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అంటూ సిద్దు చెబుతుండగానే అతడిని ఆపి హగ్ చేసుకున్నారు బాలయ్య.

ఆ తరువాత విశ్వక్ సేన్ లైఫ్ లో వచ్చిన బిగ్ ట్రబుల్ ఏంటి? అని అడగగా..తన అక్క హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని ,రాత్రి ఒంటిగంట వరకు హాస్పిటల్లో ఉండి ఉదయాన్నే ఆరు గంటలకి సెట్ కి వెళ్లాను అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా ఆద్యంతం ఈ ప్రోమో కాస్త ఎమోషనల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news