స్టోరీలో చిరంజీవి వేలు పెడతారనే.. వాళ్లను దారుణంగా కొడతా – మోహన్‌ రాజా

-

స్టోరీలో చిరంజీవి వేలు పెడతారనే.. వాళ్లను దారుణంగా కొడతానని గాడ్‌ ఫాదర్‌ దర్శకుడు మోహన్‌ రాజా హెచ్చరించాడు. మెగాస్టార్‌ చిరు తాజాగా నటించిన మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ కూడా జరిగింది.

మరి ఈ చిత్రం హిట్ కావడంతో నిన్న మేకర్స్ గ్రాండ్ సక్సెస్ పార్టీని నిర్వహించుకోగా, ఇందులో మెగాస్టార్ పై దర్శకుడు మోహన్ రాజా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అయితే ఆసక్తిగా మారింది. చిరు సినిమాలో టైంలో కలగజేసుకుంటారు అంటే ఎవరినైనా కొడతా అని, ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనమే ఫూల్స్ అవుతామని, ప్రతి అంశంలో ఆయన ఇన్ ఫుట్ తీసుకోవడం వల్లే గాడ్ ఫాదర్ ఈరోజు మెగా బ్లాక్ బస్టర్ అయ్యింది అంటూ మోహన్ రాజా తెలిపారు. దీనితో ఈ అంశంపై మాత్రం తన స్పందన మెగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news