T20 World Cup 2022 : ఇండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ బయలుదేరిన షమీ

-

T20 World Cup 2022 : ప్రపంచ కప్ కు ముందు ఇండియాకు గుడ్ న్యూస్ అయింది.  టీం ఇండియా ఫ్రంట్ లైన్ పెసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాస్ అయినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సిఏ అకాడమీలో షమీ కి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు.

t20 ప్రపంచ కప్ కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ ను ముగించుకున్న శ్రేయాస్ అయ్యర్, సిరాజ్, రవి బిష్నోయి కూడా షమీ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళనున్నారు.

అటు ఇప్పటికే గాయం కారణంగా బూమ్రా, జడేజా దూరం కాగా తాజాగా స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ప్రపంచకప్ ఆడట్లేదని ఇన్ సైడ్ స్పోర్ట్స్ వెల్లడించింది. దీనిపై బీసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా సౌత్ ఆఫ్రికా తో తొలి వన్డే సందర్భంగా చాహార్ గాయపడ్డాడు. ఇతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news