దమ్ముంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి – మంత్రి దాడిశెట్టి రాజా

-

దమ్ముంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ తలపెట్టిన ‘ప్రజాగర్జన‘ను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నాడని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.. ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.

తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ, పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికి పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టిడిపి ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రోడ్లపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి డ్రామా చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టాము. రోడ్లు వేయడం అనేది నిరంతర ప్రక్రియ. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తుల కోసం సీఎం వైఎస్ జగన్ రూ. 1500 కోట్లు కేటాయించారు. 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news