తెలంగాణలో మరో దారుణం..పాప వేలిని కొరికేసిన కోతులు

-

తెలంగాణ రాష్ట్రంలో కోతులు మరియు కుక్కలతో ప్రజలు హడలిపోతున్నారు. హైదరాబాద్ లో ఓ బాలుడు పై జరిగిన కుక్కల దాడి మరవకముందే మరో సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం లో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి.

పాపను వరండాలోని ఉయ్యాలలో పడుకోబెట్టి నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఈ తరుణంలోనే కోతులు ఒకసారిగా ఆ చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటనవేలును కొరికాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి ఆ చిన్నారిని తీసుకువెళ్లారు. ఇక అత్యవసర మెరుగైన వైద్యం కోసం వైద్యులు అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news