టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. RTI కి 100కు పైగా బండి సంజయ్ దరఖాస్తులు…!

-

తెలంగాణ సర్కార్ అవినీతిపై ఆర్‌టిఐకి బండి సంజయ్ దరఖాస్తులు దాఖలు చేశారు. గత నెల 28వ తేదీన ఆర్‌టిఐ ద్వారా సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ధరఖాస్తులు దాఖలు చేశారు బండి సంజయ్. 8 సంవత్సరాల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా బిజెపి తెలంగాణశాఖ ఆర్‌టిఐను ఆయుధంగా వాడుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు, 2014, 2018 టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ, రెవెన్యూ, ఎసిబి, సంక్షేమ, పంచాయతీరాజ్‌, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు దాదాపు వంద ధరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా  దాఖలు చేశారు.

ఈ ధరఖాస్తులను దాఖలు చేయడంలో ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, టిఆర్‌ఎస్‌ పార్టీని ఆధారాలతో సహా, పకడ్భందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ధరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా దాఖలు చేయాలని, పార్టీకి అనుబంధంగా వున్న యువమోర్చాలు, పార్టీ రాష్ట్రనాయకులు వివిధ అంశాలపై ఆర్‌టిఐ ద్వారా ధరఖాస్తులు చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జి.మనోహర్‌రెడ్డి వందలకోట్లు ఖర్చుచేసి దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలపై ధరఖాస్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news