ఈ మొక్క తో 150 కి పైగా రోగాలు నయం.. ఎలా అంటే..?

-

రణపాల మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. అందరూ ఇష్టంగా ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద అలంకరణ మొక్కగా పెంచుతారు. అందం కోసం పెంచుకునే ఈ మొక్కలో ఎన్నో రోగాలు నయం చేసే గుణం ఉందట. ఈ రణపాల మొక్క సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. ఈ మొక్కలో మనకు యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ , యాంటీ మైక్రో బయల్, యాంటీ ఫంగల్ లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క ఆకులు కాస్త మందంగా.. తింటే వగరు,పులుపుగా అనిపిస్తాయి. మరి ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రణపాల మొక్క యొక్క ఉపయోగాలు :

జీర్ణాశయ సమస్యలకు రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అలానే అజీర్ణం , మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది.

ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడే వారికి రణపాల ఆకు మంచి ఔషధం.

ఈ ఆకుల్లో వుండే యాంటీఫైరటిక్ వల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వున్న వారికి మంచి మేలు చేస్తుంది.

కిడ్నీ సమస్యల నివారణకు.. కిడ్నీ సమస్యలు, కిడ్నీలో స్టోన్ లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజు ఉదయం,సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ml మోతాదులు తాగవచ్చు. దీనివలన మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.

ఈ రణపాల ఆకులను రోజు తినడం వలన డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు చాలా మేలు చేస్తుంది. అలానే మూత్రపిండాల పనితీరు మెరుగ్గా పడుతుంది.

ఈ రణపాల ఆకును తినడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ ఆకులను ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

రణపాల ఆకులను కడిగి రసం తీసి మజ్జిగలో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి..

రణపాల ఆకు స్త్రీలలో జరిగే రక్త స్రావాన్నీ కూడా ఆపుతుంది.

రణపాల ఆకులను వేడి గడ్డలపైన పెడితే అవి కరిగి పోతాయి.. ఇలా మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news