కన్న కొడుకునే పెండ్లి చేసుకున్న మహిళ..

-

నేటి సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. శారీరక సుఖం కోసం చెడు దారులను ఎంచుకుంటూ.. జీవితాలను చీకట్లోకి నెట్టుకుంటున్నారు. తాత్కాలిక సుఖం కోసం.. నిండు నూరేళ్ల జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో స్త్రీలపై సాగుతున్న అత్యాచార కాండలను చూస్తూనే ఉన్నాం. అయితే అక్రమ సంబంధాలు కూడా పెట్రేగిపోతున్నాయి. విలువలు మరిచి.. కూతురుపై తండ్రి, అన్నదమ్ములు.. బాబాయ్‌.. ఇలా అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. ఆఖరి తల్లితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడం శోచనీయం.

Indian businesswoman goes viral after offering arranged marriage match a job instead | The Independent

ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. అనంతరం అతడు వదిలేయడంతో ఇంద్రరామ్‌ను రెండో వివాహం చేసుకున్నది. ఇంద్రరామ్‌, బబ్లీ సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కొడుకు వారి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. గతకొంత కాలంగా అతడు తన తల్లి దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే సడన్‌గా ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉన్నదని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని.. ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుని పోయారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news