మరోసారి ఎంపీ అర్వింద్‌ వివాదస్పద వ్యాఖ్యలు

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నోటాకు ఓటు వేసినా.. కారు గుర్తుకు ఓటేసినా.. హస్తం గుర్తుకు ఓటేసినా.. తానే గెలుస్తానంటూ చెప్పుకొచ్చారు అర్వింద్. అయితే.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అర్వింద్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. బుడబుక్కల కులంపై నోరు పారేసుకున్నారు. వెంటనే సరిచేసుకునేందుకు క్షమించండి అని కోరారు. మంత్రి కేటీఆర్‌ను దూషిస్తూ బుడబుక్కల పదం వాడారు.

Nizamabad: Farmers mock MP Arvind by setting up posters on turmeric board  promise

ఆ తర్వాత నోరు జారిన విషయం గమనించి బుడబుక్కల కులాన్ని కించపర్చేందుకు తాను ఆ మాట అనలేదని, కేటీఆర్‌ వేషధారణ అందుకు సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్య చేశానని వివరించారు. అర్వింద్‌కు మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువేనని, ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మరీ రైతులను మోసం చేసిన ఘనత ఆయన సొంతమని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news