మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధం: ఎంపీ కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర నాయకుల రచ్చ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సోనియాకు ఓ లేఖ రాశారు. రేవంత్‌రెడ్డి తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే ప్రియాంకగాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకలను అవమానించేలా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. చండూరు సభ, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక లాంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు.

తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌తో వేదిక పంచుకోలేనంటూ సోనియాకు వివరణ ఇచ్చిన వెంకట్‌రెడ్డి.. దశాబ్దాలకుపై కాంగ్రెస్‌లో తాను పనిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీనియర్‌ నేతలను రేవంత్​ హోంగార్డులతో పోల్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news