150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ

-

ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని నరసాపురం ఎంపీ, టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక కనిపించదని వ్యాఖ్యానించారు.

‘గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 151. ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్న ఒకటి పోతుందో తెలియదు. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు ఓటేసేందుకు తరలివచ్చారు. జన స్పందనతో పోలింగ్‌ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు తిరుగుముఖం పట్టారు.’ అని రఘు రామకృష్ణరాజు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news