ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌ భేటీ

-

కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. చర్చించేందుకు దిల్లీకి రావాలని ఆపార్టీ అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన వెళ్లకపోవడంతో కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రాజగోపాల్‌ పార్టీ మారకుండా చూసే బాధ్యతను ఆ పార్టీ అధిష్ఠానం ఉత్తమ్‌కు అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని ఉత్తమ్‌ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్​తో పాటు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి కూడా రాజగోపాల్​రెడ్డితో భేటీ అయ్యారు.

తెరాస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే దిశగా వేస్తున్న అడుగుల్లో రాజీ పడేది లేదని శుక్రవారం రాజగోపాల్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజీనామా, మనుగోడు ఉపఎన్నిక ఖాయమనే అంశాలను తేల్చి చెప్పారు.

 

సొంత ప్రయోజనాలు, పదవులు తన లక్ష్యం కాదని పేర్కొంటూ ఇటీవల వస్తున్న విమర్శపై స్పందిస్తూ.. తన నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయంటూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరే అంశాన్ని పరోక్షంగా పేర్కొన్నారు. మరో కురుక్షేత్ర యుద్ధానికి సమరశంఖం పూరించాలంటూ మునుగోడు ఉప ఎన్నిక ఖాయమన్నట్లు సంకేతాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news