ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ఐపీఎల్ 2022 లోనూ చెన్నై కెప్టెన్ ధోనినే !

-

ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ఉన్న క్రేజ్‌.. మరే మ్యాచ్‌ లకు లేదు. రెగ్యూలర్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ తో పాటు.. మాములు జనాలు ఎక్కువగా ఐపీఎల్‌ మ్యాచ్‌ లను చూడటానికి ఇష్ట పడతారు. అలాగే.. ధోని కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అంటే చాలా మంది లైక్‌ చేస్తారు. అయితే.. వచ్చే ఏడాది మహేంద్ర సింగ్‌ ధోని..ఐపీఎల్‌ కు దూరం అవుతారనే వార్తలు మొన్నటి నుంచి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యం లో ధోని ప్యాన్స్‌ కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్రతి నిధులు శుభవార్త చెప్పారు. వచ్చే ఐపీఎల్‌ లోనూ చెన్నై జట్టు లో మహేంద్ర సింగ్‌ ధోని కొనసాగుతాడని ప్రకటించారు. ఈ మేరకు ధోని కొనసాగింపు పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజ్‌ కీలక ప్రకటనను విడుదల చేశారు. వచ్చే ఐపీఎల్‌ వేలంలో ధోనిని రిటైన్‌ చేసుకుంటామని.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్పష్టం చేసింది. ఐపీఎల్‌ – 15 సీజన్‌ లో మరో రెండు కొత్త జట్లు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 10 జట్లతో ఐపీఎల్‌ 15 ను నిర్వహిస్తాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news