ఎస్సీ,బీసీ,కాపు కులాలకు ముద్రగడ లేఖ

-

కాపు ఉద్యమ నేత,మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని… ఎస్సీ, బీసీ,కాపు కులాలకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తక్కువ జనాభా కలిగిన వర్గాలు అధికారం అనుభవిస్తున్నారని.. ఈ లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. ఎక్కువ జనాభా కలిగిన ఎస్సీ, బీసీ, కాపులు అధికారం ఎందుకు అనుభవించకూడదని ప్రశ్నించారు.

పల్లకీ మోయడం కాదు పల్లకీలో కూర్చునేలా ఆలోచన చేయాలని ఎస్సీ, బీసీ,కాపు కులాలకు పిలుపునిచ్చారు ముద్ర గడ. రాజ్యాధికారం కోసం ఎస్సీ,బీసీ,కాపులు బ్లూప్రింట్ తయారు చేద్దామని కోరారు. రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చాపకింద నీరులా, భూమి లోపల వైరింగ్ లా ఉండాలని లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news