IPL 2023: 5 టైం ఐపీఎల్ ఛాంపియన్ ముంబై బోణీ కొట్టేనా ?

-

ఐపీఎల్ లో జరిగిన 15 సీజన్ లలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఘనత ముంబై ఇండియన్స్ కు దక్కుతుంది. గతంలో ముంబై ఇండియన్స్ టైటిల్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో మలింగ, బుమ్రా, బౌల్ట్ , పోలార్డ్, హార్దిక్ మరియు సూర్యకుమార్ యాదవ్ లు ఉండేవారు. కానీ ఇప్పుడు కొందరు ఆటగాళ్లు జట్టుతో లేకపోగా ఉన్న వాళ్ళు అంచనాలకు తగినట్లు రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ముంబై టీం లో చెప్పుకోదగిన ఒక్క బౌలర్ లేకపోవడం గమనార్హం.

కేవలం జోఫ్రా ఆర్చర్ మరియు పీయూష్ చావ్లా లు మాత్రమే సీనియర్ బౌలర్లు ఉండగా, మిగిలిన వారంతా ప్రేక్షకులకు పరిచయం కూడా లేరని చెప్పాలి. వీరిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి ఆటగాళ్లు విరుచుకుపడుతున్నారు. మరి వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఈ రోజు ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో అయినా గెలిచి బోణీ కొడుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news