ఐపీఎల్ : ఇప్పటిదాకా వార్ వన్ సైడే.. మరి ఎప్పుడు..?

-

ఈరోజు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. ఫైటింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇద్దరు సమఉజ్జీలు తల పడుతుండడంతో ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇద్దరు జట్లకు బలాబలాలు కూడా సమానంగానే ఉండడంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం అంచనాలకు అందని విధంగా ఉంది.

అయితే గత రికార్డులను చూసుకుంటే మాత్రం కోల్కత నైట్ రైడర్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు పైచేయి సాధించింది అని చెప్పాలి. పైచేయి సాధించడం కాదు ఇప్పటి వరకు మొత్తం వార్ వన్ సైడ్ అన్నట్లుగానే నడిచింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో 25 సార్లు తలపడింది. ఇక ఈ మ్యాచుల్లో 19 సార్లు ముంబై జట్టు విజయం సాధించగా.. కోల్కతా జట్టు కేవలం 6 సార్లు మాత్రమే విజయం సాధించింది, ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ ఉంటే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ముంబై ఇండియన్స్ ఆటగాడు నరేన్ ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news