ముంబై యువతి రేప్, మర్డర్ కేసు… ఇద్దరు నిందితుల అరెస్ట్

-

ముంబై కుర్లా ప్రాంతంలో అత్యాచారం, హత్యకు గురైన 20 ఏళ్ల యువతి కేసు కొలిక్కి వచ్చింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరు యువతికి బాగా తెలిసిన వాళ్లే. ముంబై కుర్లా ప్రాంతో ఓ పాడుపడిన బిల్డింగ్ 13 వ అంతస్తులో 20 ఏళ్ల యువతి శరీరం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సదరు యువతిపై అత్యాచారాని పాల్పడి హత్య చేసినట్లు తెలిసింది. తలపై, గొంతుపై గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. అయితే ఈకేసు ముంబైలో సంచలనం కలిగించింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని తక్కువ సమయంలోని నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

పోలీసులు బాధితురాలని గోవండి ప్రాంతానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. నిందితులని రేహాన్(21), ఫైసల్(20)లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో రేహాన్ యువతికి బాయ్ ఫ్రెండ్. యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే అతను చంపెసిటనట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లి గురించి మాట్లాడేంాదుకు అని సదరు యువతిని రమ్మని లౌంగికంగా వేధించి హత్య చేసినట్లు తెలిసింది. హత్య సమయంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతోనే శరీరంపై గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news