జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం..విద్యాశాఖకు మున్సిపల్‌ సూళ్ల బాధ్యతలు

-

జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖకు మున్సిపల్‌ సూళ్ల బాధ్యతలు అప్పగించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ పాఠశాలల అజమాయిషీని పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్‌. మొత్తంగా ఉన్న 123 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో 59 స్థానిక సంస్థల్లో మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి.

ఇందులో 1942 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మున్సిపల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది సర్కార్. ఈ మార్పుతో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసిన ప్రభుత్వం.. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలనే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. మున్సిపల్ పాఠశాలల ఆస్తులు మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news