రూ. 2 వేల కోసం గొంతు కోసి హత్య… స్నేహితుడి దురాగతం

-

రెండు వేలు కేవలం రెండు వేల కోసమే హత్య. అది కూడా స్నేహితుడినే. క్షణికావేశంలో తీసుకున్న దారుణమైన నిర్ణయం ఓ హత్యకు పురిగొల్పింది. ముందు వెనక ఆలోచించకుండా తన స్నేహితుడినే అంతంమొందించాడు. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఫకీర్ వాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మద్యం మత్తులో రూ.2 వేల కోసం ఓ వ్యక్తి కనికరం లేకుండా స్నేహితుడి గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సోను(27) బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్ కువచ్చాడు. ముషీరాబాద్ లో నివాసం ఉంటూ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. కాగా స్థానికంగా మటన్ షాపులో పనిచేసే అల్తాఫ్ ఖాన్ తో సోనుకు స్నేహం ఏర్పడింది. ఈక్రమంలోనే సోను, అల్తాఫ్ ఖాన్ కు రూ. 2 వేలు అప్పుగా ఇచ్చాడు. ఎప్పటిలాగే ఇద్దరు కలిసి గురువారం రాత్రి మద్యం తాగారు. ఈ క్రమంలోనే సోను తాను అప్పుగా ఇచ్చిన రూ. 2 వేల కోసం అల్తాఫ్ ఖాన్ ను అడిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త గొడవకు దారి తీసింది. అనంతరం అక్కడి నుంచి తన మటన్ షాపుకు వెళ్లి కత్తి తీసుకువచ్చి సోనుపై దాడి చేశాడు. గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అల్తాఫ్ ఖాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ఏసీపీ శ్రీధర్ తెలిపారు. సమచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news