ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? అయితే తప్పక ఈ విషయాలని తెలుసుకోండి..!

-

మన దగ్గర వుండే ముఖ్య డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన చాలా లాభాలు ఉంటాయి. ప్రతీ దానికి కూడా ఆధార్ కార్డు తప్పక ఉండాలి. ఏ చిన్న పనికి అయినా కూడా ఆధార్‌ కార్డు తప్పక ఉండాలి. ప్రతీ దానికి కూడా ఆధార్ కార్డు తప్పని సరి. ప్రతి దానికి ఆధార్‌ అవసరమే. పాన్ కార్డు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక చత్రకు సంబంధించిన విషయాలలో పాన్ కార్డు అవసరం. రెండింటి విషయం లో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ని జూన్ 30 వరకు లింక్ చేయడానికి కేంద్రం చివరి తేదీ అని చెప్పింది. జూన్ 30 వరకు లింక్ చేయడానికి కేంద్రం చివరి తేదీని పొడిగించిన విషయం తెలిసిందే. మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి కోసం పాన్‌, ఆధార్‌ కార్డులు ముఖ్యమని పేర్కొంది. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి పాన్, ఆధార్ నంబర్ తప్పని సరి. మార్చి 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ని చూస్తే.. ఇప్పుడు కేవైసీ ముఖ్యం. ఆధార్ నంబర్‌ను ఎవరైనా
సబ్మిట్ చేయకపోతే అవ్వదు. ఇప్పుడు ఈ పథకాల లో పెట్టుబడి పెట్టడానికి చందాదారులు కనీసం ఆధార్ నంబర్‌ను సబ్మిట్ చేయాలి.

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా సెప్టెంబర్ 30లోగా ఆధార్ నంబర్‌ను సమర్పించాలని పేర్కొంది. కొత్త చందాదారులు ఆరు నెలల్లోగా ఆధార్ వివరాలను సబ్మిట్ చెయ్యాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ నంబర్‌ను కేటాయించకపోతే రిజిస్ట్రేషన్ నంబర్ పని చేస్తుంది. ఖాతా తెరిచిన ఆరు నెలల్లోగా ఆధార్ వివరాలను సబ్మిట్ చేయక పొతే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్స్ యోజన ఖాతా క్లోజ్ అయిపోతుందని కేంద్రం తెలిపింది. పొదుపు ఖాతా ని ఓపెన్ చేస్తే పాన్ నంబర్‌ను తప్పక ఇవ్వాలి. ఖాతా తెరిచే సమయం లో ఈ రెండు పత్రాలు ని తప్పని సరిగా సమర్పించాలి. రెండు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news