పార్టీ కార్యకర్తలే ఫైనల్…. ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు !

-

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి నిన్నమొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవలు లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కార్యకర్తలు నేతలకు ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారని ఆయన పేర్కొన్నారు. అందుకే అలా వచ్చిన వారిని కూడా కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుంటారని ఆయన అన్నారు.

ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే వేదం అని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇక మీదట కార్యకర్తలు సూచించిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని కూడా పేర్కొన్నారు.. జనగామ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news