మాంసాహారులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త… త్వరలో మటన్ క్యాంటీన్లు

-

మాంసాహార ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రకరకాల ఐటమ్స్ తో త్వరలో మటన్ క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తులు పెరిగాయి.

దీంతో మాంసం ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సమయతమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించే మటన్ క్యాంటీన్లలో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఈ మటన్ క్యాంటీన్లలో మటన్ బిర్యానీ తో పాటు గుర్ధా ఫ్రై, పాయ, ఖీమా, పత్తార్ కా గోస్ట్ వంటి రుచికరమైన వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో మొదటి క్యాంటీన్ ను కో ఆపరేటివ్ ఫెడరేషన్ కార్యాలయం ఉన్న హైదరాబాద్ శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news