బాలకృష్ణ చొరవతో త్వరలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కీలక పదవి..!

-

అతి చిన్న వయసులోని నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అభిమానులు కూడా శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువు తో పోరాడిన తారకరత్న చివరికి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారకరత్న రాజకీయాలలో కూడా తన మార్క్ ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా గుండె సమస్య తీవ్రంగా మారడంతో మరణం సంభవించింది. తారకరత్న మరణం తర్వాత కుటుంబ భారం ఆయన భార్య అలేఖ్యరెడ్డి పై పడింది. వీరిద్దరిని ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.

భర్త మరణంతో ఆమె ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు ఆమెకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తారకరత్న ఫ్యామిలీకి బాలకృష్ణ ఫుల్ సపోర్టు లభించుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఎలాంటి సమస్య లేకపోయినా మానసికంగా త్వరగా ఆమె ఈ విషాదం నుంచి తెరుకోవాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక పనిలో ఆమె బిజీ అయితే కానీ మునుపటిలా మారడం కష్టం. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడానికి బాలయ్య ప్రయత్నిస్తున్నారట.

ఈసారి తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయాలని భావించాడు..అయితే తారకరత్నకి దక్కని ఆ అవకాశాన్ని అలేఖ్య రెడ్డి కైనా కల్పించాలని బాలయ్య భావిస్తున్నారట. చంద్రబాబుకు చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఆమెకు కీలక పదవి ఇవ్వాలని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. గతంలో హరికృష్ణ మరణించినప్పుడు కూడా ఆయన కుమార్తె సుహాసిని కి చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలేఖ్య రెడ్డి విషయంలో కూడా త్వరలోనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news