సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

-

పార్టీలో అంతర్గత సమస్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ చేసింది. నాయకుల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. అందులో భాగంగా మైలవరం పంచాయతీని తెగొట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొద్ది రోజులుగా రసవత్తరంగా సాగుతున్న వసంతా వర్సెస్ జోగి రమేష్ ఎపిసోడ్ పై దృష్టి సారించారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో నేడు సీఎం జగన్ భేటీ కానున్నారు.

గత కొన్ని రోజులుగా వసంత వర్సెస్ జోగి అన్నట్లుగా మైలవరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వసంతను బహిరంగంగానే జోగి అనుచరులు దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి జోగి రమేష్ ని కారులో తీసుకువెళ్లారు సీఎం జగన్. మైలవరం పంచాయతీ పై సీఎం జగన్ జోగి రమేష్ తో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నేడు వసంత కృష్ణ తో కూడా భేటీ కానున్నారు. సీఎం జగన్ తో అపాయింట్మెంట్ కారణంగా నేడు వసంత కృష్ణ నిర్వహించాలనుకున్న ప్రెస్ మీట్ ని కూడా రద్దు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news