బాలయ్య సినిమా కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్.. వర్కౌట్ అవుతుందా..?

-

రవితేజ క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఆరుపదుల వయసులో కూడా యంగ్ బ్యూటీ శృతిహాసన్ తో బాలయ్య కాలు కదపడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇప్పటివరకు లేనివిధంగా బాలయ్య ఈ సినిమాలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానులలోనే కాదు మిగతా సినీ ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచడానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.

ఈ విషయమై పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయన కూడా బాలయ్య మీద అభిమానంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి అంగీకరించారట . ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలులో జనవరి 6వ తేదీ సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఇలా చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేయబోతున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ వేసిన స్కెచ్ ఫలిస్తే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news