మన్మథుడు రీరిలీజ్‌ డేట్‌ లాక్‌.. ఎప్పుడంటే..?

-

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజింగ్ ట్రైండ్ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కాగా ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నాగార్జున కూడా చేరిపోయారు. ఇక నాగ్ కెరీర్ హిట్ చిత్రాల్లో ‘మన్మథుడు’ ఒక్కటి. కాగా 2002లో విడుదలైన ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా.. సోనాలీ బింద్రే, అన్షు కథానాయికగా నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రీరిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మూవీ టీమ్. ముందు నుంచి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం రీరిలీజ్‌తో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

నాగార్జున 'మన్మథుడు' రీరిలీజ్ డేట్ ఫిక్స్..

2002లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వెండి తెరపై మరోసారి కనువిందు చేయనున్న తరుణంలో.. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఓ కామెడీ ప్రోమోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. “ఇతను మగాడు.. ఇతనికి వండిపెట్టే వాడూ మగాడే. ఇతని లాన్ లో పెరిగే మొక్కలూ మగవే. అందుకే వేటికీ పూలుండవు” అని ఫస్ట్ ఫస్టే కామెడీ అండ్ ఇంట్రస్టింగ్ డైలాగ్ తో ఈ ప్రోమో మొదలైంది. ఇక ‘మన్మథుడు’ సినిమాలో ఎక్కువ కామెడీ సీన్స్ బ్రహ్మానందంతోనే ఉంటాయి. దానికి సంబంధించిన ఓ చిన్న సీన్ ను కూడా ఈ ప్రోమోలో చేర్చారు. ఎస్కలేటర్ పై ఎలా నిలబడాలో హీరో, హీరోయిన్లకు బ్రహ్మానందం చెప్పే ఓ కామెడీ సీన్ మరోసారి నవ్వులు పూయిస్తోంది. “ఎలా దిగాలో తెలియక ఇలా దిగాము” అని నాగార్జున చెప్పే డైలాగ్.. దానికి బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇలాంటి సీన్స్ ఈ మూవీలో చాలానే ఉంటాయి. వీటిని మరోసారి థియేటర్లలో వీక్షించి, ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండమని తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ ప్రోమోను రిలీజ్ చేసింది. దాంతో పాటు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసు కదా అంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ ను కూడా వీడియోకు చేర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news