టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు : నందిగాం సురేష్‌

-

టీడీపీ పై నందిగాం సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు ఉన్నామని ఆయన అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే మోకాలడ్డి చంద్రబాబు శునకానందం పొందుతున్నాడు అని వెల్లడించారు సురేష్. అమరావతి మీ అడ్డా కాదు.. మా బిడ్డలు ఉంటారు.. ఈ యుద్ధంలో మేం కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు.. పుంగనూరులో కొంచెం తోపులాట జరిగింది.. దీన్ని చంద్రబాబు పెద్దది చేసి చూపించాడు.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు రౌడీలా మాట్లాడాడు అని ఎంపీ నందిగాం సురేష్ తీవ్రంగా మండిపడ్డారు.

MP Nandigam Suresh in trouble over allegations on falsifying the caste  certificate

సీఐ అంజూ యాదవ్ ఒక వెధవని కొట్టారని పవన్ కళ్యాణ్ చాలా హడావిడి చేశాడు అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. మరి టీడీపీ కార్యకర్తలు 40 మంది పోలీసులపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎటు పోయాడు అని ప్రశ్నించాడు. అధికారాన్ని లాక్కోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అని అయన అడిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రాష్ట్రం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అని నందిగాం సురేష్‌ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news