పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ మరోసారి సెటైర్లు

-

మరోసారి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. పవన్ కు, కేఏ పాల్ కు పెద్ద తేడా లేదని… ఇంకా చెప్పాలంటే పవన్ కంటే కేఏ పాలే ఎక్కువ మేధావి అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కంటే.. కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఏమైపోయినా పవన్ కు అనవసరమన్నారు. టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ బయటకు వస్తారని సురేష్ మండిపడ్డారు.

జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని… ప్రజలు ఆనందంగా ఉండటాన్ని చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఓర్చుకోలేకపోతున్నారని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పేద వాళ్లందరూ ఎదగాలని జగన్ పని చేస్తుంటే… తన బినామీలు బాగుంటే చాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు ఎంపీ సురేష్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news