“కొడుకు లోకేష్ ను అభినందించిన చంద్రబాబు”

-

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఓడించి మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్న బలమైన కోరికతో ప్రణాళికలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర, పాదయాత్ర లాంటివి అమలు చేస్తూ ఉంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు. ఈ రోజుకి లోకేష్ పాదయాత్ర 200 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ను అభినందించాడు. ప్రజల సమస్యల కోసం నారా లోకేష్ చేపట్టిన యాత్ర ఇంకా కొనసాగించాలని చంద్రబాబు కోరారు. ఇంకా ఈ పాదయాత్రలో సగం పార్ట్ పూర్తి కాగా, ఇంకా సగం మిగిలి ఉంది.

మరి లోకేష్ చేస్తున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించి ఓట్లు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news