జగన్ కు సబ్జెక్టే లేదు.. టైంపాస్ చేస్తున్నాడు : నారా లోకేష్ ఫైర్

-

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై నిప్పలు చెరిగారు నారా లోకష్. సబ్జెక్ట్ లేని సీఎం జగన్.. మూడు రాజధానులు అంటూ టైమ్ పాస్ చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందన్నారు. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన HSBC మూతపడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ys jagan on nara lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని.. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బిసి కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని అగ్రహించారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు అని మండిపడ్డారు. విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news