వైసీపీ నేతల మాటలు విని వేధించే పోలీసులను వదలబోం : లోకేశ్‌

-

51 నెలల్లో 64 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని వెల్లడించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. “వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించారు, ఇక మా ఓపిక నశించింది… చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు” అంటూ లోకేశ్ నిప్పులు చెరిగారు నారా లోకేశ్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో వైసీపీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ బాధితుల గోడు విని తీవ్రంగా చలించిపోయారు. అనంతరం మాట్లాడుతూ… జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం, మతం సైకోయిజం అని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నాడని అన్నారు. “బ్యాంకులను ముంచేసి లక్ష కోట్లు దొబ్బి 14 నెలలు చిప్పకూడు తిన్న 420 ముఖ్యమంత్రి కావడం వల్లే టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారన్నారు.

Nara Lokesh Is New Trouble Shooter in TDP!!

మేం కార్యకర్తలను రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారు, మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక మా ఓపిక నశించింది… మా వాళ్ల జోలికొస్తే జరగబోయేది యుద్ధమేనని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు జగన్ శ్రీకారం చుట్టాడు… నేను ఫుల్ స్టాప్ పెడతాను. కార్యకర్తలను హతమార్చారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా మా అధినేతపైనే హత్యాయత్నం చేశారు, మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిచేసిన వాడికి, మమ్మల్ని బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారు, దీని ద్వారా ప్రజలకు ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? జగన్ ఒక సైకో… చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకర్ని తయారు చేసి మా కార్యకర్తల పైకి ఉసిగొల్పుతున్నారని నారా లోకేశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news