ఫేక్ అకౌంట్లతో రచ్చ..లోకేష్ ఆగ్రహం..!

-

టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైకాపా అధ్యక్షుడు జగన్‌  గారికి మేటర్ వీక్ అనే విషయం పేటీఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు’ అని చెప్పారు. అలాగే ‘అన్నదమ్ముల్లా ఉన్న నాకు, ఎంపీ రామ్‌ మోహన్‌ నాయుడి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటీఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టీడీపీ నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటీఎం బ్యాచ్ కి గుర్తుచేస్తున్నాను’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news