ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతాం – నారా లోకేష్

-

ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ నేత నారా లోకేష్. టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కుప్పం ఆర్టీసి బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసిపి రౌడీలు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అర్థరాత్రి కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసిపి రౌడీ మూకల పై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

ఇక అటు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కి హాట్సాఫ్ అని కొనియాడారు. నిరంకుశ ప్రభుత్వం పై మీ పోరాటం స్ఫూర్తినిచ్చింది. సేవ్ ఏపీ పోలీస్ అంటూ సీఎం జగన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు ఒక దళిత కానిస్టేబుల్ కి లేదా? అదే నిరసన మీ సొంత సామాజిక వర్గం వారి నుండి వస్తే వేటు వేసేవారా జగన్ రెడ్డి గారు? అని ఫైర్ అయ్యారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news