ఏపీలో రాష్ట్రపతి పాలన వేయాల్సిందే ! – నారా లోకేష్‌

-

ఏపీలో రాష్ట్రపతి పాలన వేయాల్సిందేనని మాచర్ల ఇష్యూపై నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టిడిపి శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని ఆగ్రహించారు నారా లోకేష్‌.


ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టిడిపి వారిపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు టిడిపి కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైసీపీకి కొమ్ముకాయడమేనని నిప్పులు చెరిగారు. టిడిపి వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి. వైసిపి రౌడీ మూకల దాడిలో గాయపడిన టిడిపి నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news