చంద్రబాబు ఒక్క చిటికే వేస్తే..వైసీపీని భూస్థాపితం చేస్తా – నారా లోకేష్

-

చంద్రబాబు ఒక్క చిటికే వేస్తే..వైసీపీని భూస్థాపితం చేస్తానని నారా లోకేష్ హెచ్చరించారు. చంద్ర‌బాబు గారి ఆదేశాల‌తో స‌హ‌నం పాటిస్తున్నామని.. ప్ర‌జాస్వామ్య‌యుతంగా ప్ర‌వ‌ర్తిస్తున్నామని తెలిపారు. వైసీపీ మూక‌ల్లాగే మేమూ తెగిస్తే..ఒక్క వైసీపీ ఆఫీసూ మిగ‌ల‌దని… గ‌న్న‌వ‌రంలో టిడిపి కార్యాల‌యం ధ్వంసం చేశామ‌నుకుంటోందని వైసీపీపై ఆగ్రహించారు.

వైసీపీ ధ్వంసం చేసింది రాష్ట్రాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని. వైసీపీ ప‌ని అయిపోయింది. తెలుగుదేశం వ‌స్తోంది. టిడిపిపై దాడి చేసిన ఏ ఒక్క‌డినీ వ‌ద‌లమన్నారు. గన్నవరంలో వైసీపీ రౌడీల హింసాత్మక దాడులు… ఆ తర్వాత బాధితులైన తెలుగుదేశం నేతల పైనే పోలీసుల అక్రమ కేసులు… అరెస్టైన నేతల హింస… గన్నవరంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని వివరించారు. జగన్ రెడ్డి, అతనితో చేతులు కలిపిన కొంతమంది కళంకిత పోలీసులే హంతకులు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ హత్యను ఖండించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news