శ్రీవారి జోలికి వచ్చిన..వైఎస్‌ గతి ఏమైందో తెలుసు కాదా – నారా లోకేష్‌

-

శ్రీవారి జోలికి వచ్చిన..వైఎస్‌ గతి ఏమైందో తెలుసు కాదా అంటూ వైఎస్‌ మృతిపై నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పింక్ డైమండ్ కొట్టేశాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించి నాలుగేళ్ల‌య్యింది, ఏం పీకారని నిలదీశారు. ఎన్నిక‌లు అయ్యాక మ‌రిచిపోయారెందుకు? ఆరోప‌ణ‌లు చేయ‌డం తేలిక‌. పింక్ డైమండ్ ఏమైందో విజ‌య‌సాయిరెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

వెంక‌టేశ్వ‌ర‌స్వామి జోలికి వెళ్లేవారు ఎవ‌రైనా గోవిందా.. గోవిందా. ఏడుకొండ‌లు కాద‌న్న వ్య‌క్తి ఏమ‌య్యారో చూశాం. నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు, చేయ‌ను క‌నుకే తిరుప‌తి న‌డి వీధుల్లో ధైర్యంగా పాద‌యాత్ర చేస్తున్నా. త‌ప్పులు చేసి, జ‌నాల్ని మోసం చేసిన వ్య‌క్తి జ‌నం దాడి చేస్తార‌నే భ‌యంతో ప‌ర‌దాలు క‌ట్టుకుని భ‌యం భ‌యంగా బ‌య‌ట‌కొస్తున్నారన్నారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news