ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించిన కేసులో ట్విస్ట్.. నవీన్ మర్మాంగాన్ని కత్తితో కోసి మరీ !

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కు గురయ్యాడు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో బీటెక్ చదువుతున్న నవీన్ ను హత్య చేసింది ఇంటర్ క్లాస్ మెట్ హరిహర కృష్ణ గా గుర్తించారు పోలీసులు. తన లవర్‌ ను ప్రేమిస్తున్నాడనే కోపంతో.. నవీన్‌ ను హత్య చేశాడు హరిహర కృష్ణ.

నవీన్ ను కత్తితో కడుపులో పొడిచి, ఆ తర్వాత మర్మాంగాలను కోసి, తల మొండెం వేరు చేశాడు హరి హర కృష్ణ. నా ప్రియురాయల్ని ప్రేమిస్తావా అంటూ శరీరం నుంచి గుండెను వేరు చేసిన హరిహర కృష్ణ… నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చాడు. తన లవర్‌ ను ప్రేమించినందుకే చంపానంటూ పోలీసులకు తెలిపాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news