టీడీపీ వస్తే కర్నూలు లో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తాం: నారా లోకేష్

-

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో చేస్తున్న పాదయాత్రలో నిమగ్నమై ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ పాదయాత్రలో టీడీపీ గెలిస్తే ఏమి చేస్తాము మరియు వైసీపీ చేస్తున్న అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. కాగా తాజాగా ఈ రోజు పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చాడు. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హై కోర్ట్ లో సరైన సౌకర్యాలు లేవని అధికార పార్టీని విమర్శించాడు నారా లోకేష్. టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే కర్నూలు లో కొత్త హై కోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేస్తామన్నారు, అంతే కాకుండా సొంత భవనాలను కూడా నిర్మిస్తామన్నారు.

ఇక ఆర్ధికంగా బలహీనమైన లాయర్లకు సొంత ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే లాయర్లుగా ఎదుగుతున్న జూనియర్ లకు సరైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news