జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి !

-

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అని పేర్కొన్న ఆయన సిఎం కుర్చీలో ఉన్న వారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుందని కానీ జాంబీ రెడ్డి గారు టిడిపి నేతల,కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని అన్నారు. మా పార్టీ వారిపై కేసులు, అరెస్టులు టివిలో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.

అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా  మారారన్న ఆయన అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతి ఆధారాలతో సహా బయటపెట్టిన కారణంగా  రామకృష్ణారెడ్డిని  అక్రమ అరెస్టు చేశారని అన్నారు. కొంతమంది పోలీసులు అధికారులకు చెప్తున్నా మేము మీపై  బ్లాక్ బుక్ సిద్ధం చేస్తున్నాం, చట్టానికి వ్యతిరేకంగా మాపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయి, వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. నాపై కేసులు పెట్టండి బరిస్తా…నన్ను అరెస్ట్ చేయండి బాధపడను, మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తా అంటూ ఆయన సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news