ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్: యాషెస్ కన్నా… ఇండియాతో WTC ఫైనల్ చాలా ముఖ్యం.. !

-

ఐపీఎల్ తర్వాత ఇందులో పాల్గొన్న ప్రపంచంలోని క్రికెటర్లు అందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయి జాతీయ మ్యాచ్ లను ఆడడానికి సన్నద్ధం అవుతున్నారు. అదే విధంగా ఇండియా కూడా జూన్ 7వ తేదీ నుండి ఆస్ట్రేలియాతో లార్డ్స్ లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు సిద్ధంగా ఉంది. కాగా తాజాగా ఈ మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కీలక స్పిన్నర్ నాథన్ లియాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు భారత అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మాట్లాడిన లియాన్ మాకు భారత్ తో ఆడనున్న ఈ మ్యాచ్ చాలా కీలకం అన్నాడు. ఈ నెలలోనే ఇంగ్లాండ్ తో ఆడబోయే యాషెస్ సిరీస్ కన్నా కూడా WTC ఫైనల్ ను గెలుచుకోవడం పైనే మా దృష్టిని కేంద్రీకరించామని అన్నారు.

 

 

జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో కష్టపడుతున్నాము అంటూ మాట్లాడారు. ఇందులో ఖచ్చితంగా భరత్ ను ఓడిస్తామన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news