మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు.. 12 మంది దుర్మరణం

-

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయగడలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ముంబయి-పుణె హైవే పక్కన ఉన్న లోయలో బస్సు పడిపోయిందని పోలీసులు తెలిపారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అందులో 12 మంది దుర్మరణం చెందారని మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స  అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. శనివారం ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అతి వేగం లేదా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news