షాకింగ్ : దేశంలోని అతిపెద్ద కొవిడ్ సెంటర్‌ మూసివేత..!

-

కరోనా నేపథ్యంలో 10 వేల పడకలతో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద కొవిడ్ కేంద్రాన్ని మూసివేసేందుకు కర్ణాటక సిద్ధమైంది. కరోనా లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న వారికి చికిత్స అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులకు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేద నుంచి దీన్ని మూసివేయబోతున్నారు అధికారులు.

ఈ మేరకు ఇప్పటికే ఓ సర్కులర్‌ను జారీ చేశారు. రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మూసివేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇకపోతే ఇందులో ఉన్న పడకలు, ఫ్యాన్లు, డస్ట్‌బిన్లు తదితర వస్తువులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలు, ఆసుపత్రులకు ఉచితంగా అందజేయనున్నట్లు బీబీఎంపీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news