ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి !

-

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 50 మందితో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. రికినికల్ – బీరోకల్ రహదారిపై 50 మందితో వెళుతున్న పెళ్లి బస్సు నిన్న రాత్రి అదుపు తప్పి 500 మీటర్ల దిగువన ఉన్న నదిలో పడిపోయింది. ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు.

accident
accident

9 మంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికోసం రెస్క్యూ టీమ్ సభ్యులు గాలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ” ఈ ప్రమాద ఘటన దురదృష్టకరం. దీనిపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడాను. తక్షణ సహాయ చర్యలను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటాం”. అని ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news