ఏకంగా బార్ అసోసియేషన్ నే బెదిరించారు…!

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. జాతీయ స్థాయిలో న్యాయవాదులు ఆయన టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ బార్ ఆసోసియేషన్ తో పాటుగా బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా సిఎం జగన్ పై విమర్శలు చేసాయి. అయితే వారిని బెదిరించారు కొందరు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోయేషన్ కార్యదర్శి అభిజిత్ కు బెదిరింపు కాల్ వెళ్ళింది.

ఈ కాల్ కడప జిల్లా నుంచి వెళ్ళింది అని గుర్తించారు. జిల్లా లోని రాజంపేట 08565 ఎస్టీడి కోడ్ తో అభిజిత్ కు బెదిరింపు కాల్ వెళ్ళింది అని తేల్చారు. సిఎం సొంత జిల్లా నుంచి కాల్ వెళ్ళడంతో ఎవరు చేసి ఉంటారు అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. రాజంపేట నుండి బెదిరింపు కాల్ చేసింది వైసిపి కార్యకర్తల్లో జగన్ అభిమాని అయి ఉంటారు అని పలువురు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news