FLASH : అరుణాచల్ ప్రదేశ్ సీఎం కి కరోనా..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ఈ మహమ్మారి బారిన అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ పడ్డారు. దీంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అలాగే కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్‌ లో ఇప్పటి వరకు 6,297 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే అందులో 1755 యాక్టివ్ కేసులు ఉండగా.. 4531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఇప్పటి వరకు 11 మంది కరోనాతో మరణించారు. 2 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news